టిడిపి రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య
విశాలాంధ్ర – ధర్మవరం : ధర్మవరం పట్టణంలో టిడిపి జెండా ఎగురవేసేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య, పట్టణ అధ్యక్షులు పరిసే సుధాకర్ లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎనిమిది, తొమ్మిది వార్డులలో పట్టణ ప్రచార కమిటీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గారిని అనే కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గూర్చి వార్డు ప్రజలకు వివరించారు. అనంతరం కమతం కాటమయ్య ,పరిసే సుధాకర్ మాట్లాడుతూ రసం అప్పుల పాల అయిందని రాష్ట్ర అభివృద్ధి కూడా కుంటు పడిందని, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెడతానని తెలిపి, మోసం చేయడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. టిడిపి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలపై, రాష్ట్ర సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు బనాయించడం జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పై విసుకు చెందారని, వచ్చే ఎన్నికల్లో వైయస్సార్సీపి పార్టీ కు ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమనేని ప్రసాద్ నాయుడు, అంబటి సనత్ కుమార్, మారుతి స్వామి, బోయ రవిచంద్ర, షీలా మూర్తి, కరెంటు ఆది, రాళ్లపల్లి షరీఫ్, బడిగింజల రమణ, వాసుదేవా, కొత్తపేట బాబావలి, స్వర్ణకుమారి మున్ని, నాగరత్న, మీనాక్షి, అఖిల, శారద తదితరులు పాల్గొన్నారు.