జిల్లా ఎస్పీ గౌతమిసాలి
విశాలాంధ్ర -అనంతపురం : జిల్లాలోని పోలీసు అధికారులు మరియు సెబ్ విభాగం అధికారులతో ఎస్పీ నెలవారీ సమీక్షా సమావేశం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించారు.
జిల్లాలో నమోదైన ఎం.సి.సి కేసులు, ఫోక్సో, గ్రేవ్ యూ.ఐ, ఎస్సీ ఎస్టీ, మహిళలపై జరిగిన నేరాలు, తదితర కేసులను సబ్ డివిజన్ వారీగా సమీక్ష చేశారు. ఈ కేసుల్లో మరింత పురోగతి సాధించాలని సూచనలు చేశారు.
రౌడీషీటర్లు, కిరాయి హంతకుల కదలికలపై నిఘా వేయాలి. ప్రస్తుతం వారి తాజా సమాచారం, పరిస్థితులు, ప్రవర్తన తీరుపై ఆరా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలి. రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయినా మొత్తం ఆ కుటుంబమే నాశనం అవుతుందని గుర్తించాలి. ప్రతీ ఒక్కరూ గట్టి సంకల్పం, కార్యాచరణ ప్రణాళికతో రోడ్డు ప్రమాదాల కట్టడికి పని చేయాలన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ, ప్రకృతి వైపరీత్యాలు, వి.ఐ.పి ల భద్రత, సంచలనాత్మక నేరాలు జరిగిన సమయాలలో పోలీసులు ఏమి చేయాలో ఎస్పీ దిశానిర్ధేశం చేశారు. ప్రాధాన్యత ప్రకారంగా వీటికి పరిష్కారం ఎలా చూపాలో తెలియజేశారు.
మట్కా, పేకాట, మత్తు పదార్థాలు, నాటు సారా, కట్టడి పక్కాగా ఉండాలి. జిల్లాలో ఎక్కడ జూదం జరిగినా సహించం. ఎవరైనా ప్రోత్సహించినా, సంబంధాలు కొనసాగించినా చర్యలు తప్పవు. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పెంచాలన్నారు.
బేసిక్ పోలీసులో భాగంగా డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, పెట్టీ కేసులపై దృష్టి పెట్టాలి. రికార్డుల నిర్వహణ మంచిగా ఉండాలి అని తెలియజేశారు.
పేకాట, నాటు సారా, కర్నాటక లిక్కర్ లపై దాడులకు వెళ్లిన సందర్భాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు. మానవ హక్కులు భంగం కల్గకుండా చర్యలుండాలి. కోర్టు ఉత్తర్వులు పక్కాగా పాటించాలి. నిందితులను పోలీసు స్టేషన్లకు తీసుకొచ్చినప్పుడు నిబంధనల ప్రకారమే జరగాలి అని పేర్కొన్నారు.
రాత్రి వేళల్లో నిర్వహించే నిఘాలో భాగంగా బీట్స్, పెట్రోలింగ్, రోడ్ సేఫ్టీ బృందాలు, సి.సి కెమేరాలు, కంట్రోల్ రూం సిబ్బంది అప్రమత్తంగా పని చేయాలన్నారు.
ఈసమావేశంలో అదనపు ఎస్పీలు ఆర్ విజయ భాస్కర్ రెడ్డి, జి.రామకృష్ణ, డీఎస్పీలు ఎం.ఆంథోనప్ప, టి.వి.వి ప్రతాప్, బి.శ్రీనివాసులు, శివభాస్కర్ రెడ్డి, జనార్దన్ నాయుడు, మునిరాజ ( ఏ.ఆర్ )పలువురు సి.ఐ లు, ఆర్ ఐ లు, ఎస్సైలు, సెబ్ పోలీసు అధికారులు, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.