: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
విశాలాంధ్ర – అనంతపురం : వెలగపూడి, ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం అతిసార కేసుల వ్యాప్తి (స్టాప్ డయేరియా క్యాంపెయిన్), తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టరేట్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు సమీక్ష నిర్వహించారు.
అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా అతిసార కేసులు వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు మైక్రో ప్లాన్ అమలు చేయాలన్నారు. జిల్లాలో అతిసార కేసుల వ్యాప్తి అరికట్టేందుకు కమ్యూనికేషన్ స్ట్రాటజీ/మానిటరింగ్ మెకానిజం అత్యంత ముఖ్యంగా అమలు చేయాలన్నారు. ఈ విషయమై వర్క్షాప్ నిర్వహించాలని, డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేయాలని, ఆశా వర్కర్ ల ద్వారా తక్కువ బరువున్న చిన్నారులకు జింక్ ప్యాకెట్లను అందించాలన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఐఈసి యాక్టివిటీలను చేపట్టాలన్నారు. ఆరోగ్య శాఖ సహకారంతో స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు అంగన్వాడీలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు/జింక్ కార్నర్ను ఏర్పాటు చేయాలన్నారు. చిన్నారుల్లో గ్రోత్ మానిటరింగ్ నిర్వహించడంపై అంగన్వాడీ వర్కర్లకు శిక్షణ ఇవ్వడం మరియు తక్కువ బరువున్న పిల్లలకు పోషకాహారం అందించడం చేయాలన్నారు. ఎక్కడా అతిసార కేసులు వ్యాప్తి చెందకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీఓ రాణి సుస్మిత, మున్సిపల్ కమిషనర్ నరసారెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఓ రాజేష్ కుమార్, ఎంపిడిఓ సాల్మన్, సిడిపిఓ లక్ష్మిప్రసన్న, తహసీల్దార్ సుభాకర్, ఈఓఆర్డీ బాలాజీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.