Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

జూన్ 4న పౌర్ణమి గరుడసేవ.. ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ప్రతినెల పౌర్ణమి గరుడ సేవను దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం ఈవో వెంకటేశులు శుక్రవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌర్ణమి గరుడ సేవను ఈ నెల నాలుగవ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. స్వామివారిని ప్రత్యేకమైన వాహనంలో పట్టణ పురవీధులలో ఊరేగింపుగా నిర్వహిస్తామని తెలిపారు. గరుడ సేవ దాతలుగా డాక్టర్ బలుషా వెంకట సుబ్బారావు, కీర్తిశేషులు పోలా లక్ష్మయ్య సన్స్- శ్రీ నరహరి సిల్క్స్ వారు వ్యవహరించడం జరుగుతున్నదని తెలిపారు. గరుడ సేవ రోజున స్వామి వారిని వివిధ పూలచే చక్కగా అలంకరించి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పూజలు నిర్వహించిన తర్వాత దాతలకు సత్కార కార్యక్రమం ఉంటుందని, తదుపరి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. కావున ఈ గరుడసేవ కార్యక్రమానికి స్వామివారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img