Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఇండియా కూటమితోనే మైనారిటీ ల అభివృద్ధి సాధ్యం

అనంత అర్బన్ సిపిఐ అభ్యర్థి సి. జాఫర్

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : మైనారిటీలు అభివృద్ధి చెందాలంటే ఒక ఇండియా కూటమితోనే సాధ్యమని అనంత అర్బన్ సిపిఐ అభ్యర్థి సి. జాఫర్ పేర్కొన్నారు. శుక్రవారం సిపిఐ పార్టీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా స్థానిక పాతూరు లోని నీరుగంటి వీధి, ఆరవ రోడ్ లో ఉన్న అమీర్ హైదర్ కాలనీలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సి పి ఐ అభ్యర్థి జాఫర్ అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారిని ఆప్యాయంగా పలకరిస్తూ కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అమర్ హైదర్ కాలనీలో ఉన్న మసీద్ లో శుక్రవారం నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు పలికారు. ఈ సందర్భంగా జాఫర్ మాట్లాడుతూ… అనంతపూర్ పట్టణంలో ఎక్కడ చూసినా గుంతల మయమన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి అవినీతిని అరికడతామన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించే దిశగా తాను పని చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహా కార్యదర్శి పి. నారాయణస్వామి సిపిఎం నగర కార్యదర్శి రామ్ రెడ్డి సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, సహాయ కార్యదర్శి రమణయ్య, అలిపిర, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు లింగమయ్య, కేశవరెడ్డి, సంతోష్ కుమార్, రాజేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుల్లాయి స్వామి, జిల్లా అధ్యక్షులు ఏ.ఐ.వై.ఎఫ్ ఆనంద్ కుమార్ సిపిఎం మైనార్టీ నాయకులు ముస్కిన్ ఇన్ షాప్ నగర కార్యదర్శిలు ఖజా హుస్సేన్, సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు గాదిలింగప్ప సుందర్రాజు నారాయణస్వామి ప్రసాద్, శ్రీనివాస్, మున్నాఫ్, రాజు, మహిళా సమైక్య జిల్లా నాయకులు జయలక్ష్మి, జానకి, మైనార్టీ నాయకులు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img