Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

వైసీపీదే ఘన విజయం

-ఎంపీ గోరంట్ల మాధవ్

విశాలాంధ్ర-రాప్తాడు : వచ్చే నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని హిందూపురం పార్లమెంటు ఎంపీ గోరంట్ల మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. నామినేషన్ల
సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకుతోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేరు మీద ఆయన తల్లిదండ్రులు తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి, ప్రేమకుమారి ఆధ్వర్యంలో ఒక సెట్టు నామినేషన్ పత్రాలను శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి వసంతబాబుకు అందజేశారు. వైసీపీ సీనియర్ నాయకులు తోపుడు రాజశేఖర్ రెడ్డి తోపుదుర్తి చందులతో కలిసి నామినేషన్ వేసేందుకు వచ్చారు. ఎంపీ మాట్లాడుతూ ఈనెల 24వ తేదీన అత్యంత భారీ జన సందోహం మధ్యన రాప్తాడులో నిర్వహించిన అనంతరం మరోసారి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తారన్నారు. ఈ ఎన్నికల్లో సైకిల్ పంచరవుతుందని, క్లాస్ పగిలిపోతుందని, పువ్వు వాడిపోతుందని వ్యాఖ్యానించారు. 24వ తేదీన రాప్తాడులో నిర్వహించనున్న నామినేషన్ సభకు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు జిల్లాలోని తోపుదుర్తి అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరులు రాజశేఖరరెడ్డి, చందు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ తరఫున ఎస్.మల్లికార్జున, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదిఆంధ్ర శంకరయ్య ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వసంతబాబు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అనంతపురం రూరల్ డిఎస్పి వెంకటశివారెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img