విశాలాంధ్ర – బుక్కరాయసంద్రం: టిబిడ్యామ్ పై ఎగువ ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టును నిలుపుదల చేయాలని అని సీపీఐ జిల్లా సహయకార్యదర్శి పి.నారాయణస్వామి పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా రైతుల జీవనాడిప్రాజెక్టులకు నిధులురాబట్టడములో పాలకులువైఫల్యం చెందారని
నీటి సాధనకై రైతు గర్జన జీపుజాతా కార్యక్రమం బుక్కరాయసముద్ర మండల కార్యదర్శి కె.మర్రి స్వామి అధ్యక్షతన ఏడవ వరోజు మండల కేంద్రం నుండి రైతుగర్జను సీపీఐ జిల్లా సహయకార్యదర్శి పి.నారాయణస్వామి, శింగనమల నియోజకవర్గ కార్యదర్శి టి.నారాయణస్వామి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత నాల్గు సంవత్సరాలుగా ప్రాజెక్టులకు ఒక్క రూపాయికూడ ఖర్చు పెట్టక పోవడం దురదృష్టకరమని అన్నారు. దుర్బిక్ష ప్రాంతాలైన బళ్ళారి,అనంతపురం ,కర్నూలు,కడప ప్రజలు అక్రమ అప్పర్ భద్ర,నవలి ప్రాజెక్టుల నిర్మాణం అపాలని రైతులుపెద్దఎత్తున
ఉద్యమించాల్సించిన అవసరముందనితుంగభద్ర డ్యాంనుండి 32 టియంసిలు నీరు అనంతపురంజిల్లాకు రావాల్సింది.కాని హెచ్ ఎల్ సిని ఆధునికీకరించనందున మనకు అందాల్సిన వాటా కూడా అందకుండా పోతోందన్నారు, హెచ్ ఎల్ సిఅయికట్టుకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్టప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా రైతులు ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డి పెద్దయ్య, రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు. బి. రామకృష్ణ, శింగనమల మండల కార్యదర్శి తరిమెల రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసులు,బుక్కరాయసముద్రంమండలకార్యవర్గసభ్యులు.వెంకట,శ్రీనివాసురావు,భాస్కర్,నాగేంద్ర పాల్గొన్నారు.