కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : జాతీయస్థాయి హాకీ పోటీలకు ధర్మవరం పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎం శ్రావణి ఎంపిక కావడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్- ప్రభాకర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్- జీవన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం వారు మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో ఎలమంచిలి లో జరిగిన అంతర్ రాష్ట్రస్థాయి పోటీలలో శ్రావణి ఉత్తమ ప్రతిభను కనపరిచి ఈనెల ఒడిస్సా రాష్ట్రంలోని రూర్కెలలో 27 నుండి జూలై 7 వరకు జరగబోయే జాతీయస్థాయి జట్టుకు ఎంపిక కావడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా శ్రావణినీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ తో పాటు ఫిజికల్ డైరెక్టర్ ఆనందు, అధ్యాపకులు చిట్టెమ్మ, షమీముల్లా, కిరణ్ కుమార్, గోపాల్ నాయక్, పావని, భువనేశ్వరి, పుష్పావతి, గౌతమి, స్వామి తోపాటు బోధనేతర బృందము, తోటి విద్యార్థులు అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.