వైసీపీ అధినేత జగన్
విశాలాంధ్ర బ్యూరో – నెల్లూరు : రాష్ట్రంలో విధ్వంస రాజకీయాలకు పాల్పడుతూ విష సంస్కృతికి చంద్రబాబు బీజం వేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆరోపించారు. వైసీపీ నాయకులు, మద్దతుదారుల ఆస్తుల్ని ధ్వంసం చేయడమేగాక తిరిగి బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టడం ఎంత మాత్రం న్యాయం కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై, మంచి పాలన అందించడంలో చంద్రబాబు దృష్టిపెడితే మంచిదని హెచ్చరించారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్ గురువారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదన్న కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, దొంగ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పార్టీలకు అతీతంగా ప్రతి పథకం, ప్రతి మంచీ కూడా అర్హత గల అందరికీ అందించామని తెలిపారు. ఈరోజు చంద్రబాబు నాయుడుకు ఓటు వేయలేదనే కారణంతో ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను విరగ్గొడుతున్నారని మండిపడ్డారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల మాదిరిగా పండుతాయని హెచ్చరించారు. ప్రజలు టీడీపీకి ఎందుకు ఓటు వేశారో చంద్రబాబు ఆలోచించాలన్నారు. ప్రజలకు మంచి చేసి కూడా వైసీపీ ఓడిపోయిందని జగన్ అన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో ఆకర్షితులై 10 శాతం ఓట్లు అటు వైపు వెళ్లి చంద్రబాబు నాయుడు అధికారంలోకి