విశాలాంధ్ర-చింతూరు: చత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా మావోయిస్టులు ఇద్దరు లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసే ఉద్దేశంతో ముచిక ఐతా, మడకం హింగే… ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు పంకజ్ కుమార్ మీనా విలేకరుల సమావేశంలో తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు సరెండర్ రీహాబిలిటేషన్ విధానం ప్రకారం గౌరవ జీవితానికి కావల్సిన ఏర్పాట్లు చేస్తామన్నారు. వారికి రూ.లక్ష రివార్డు, పునరావాసం కల్పించనున్నట్లు తెలిపారు. మరింత మంది లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలిసి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలని, తమ కుటుంబ సభ్యులను ప్రగతి పథంలో నడిపించుకోవాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలన్నీ సకాలంలో అందేలా చూస్తామని పంకజ్ కుమార్ మీనా చెప్పారు. సమావేశంలో చింతూరు సీఐ రమేశ్, ఎస్ఐ మాథ్యు, ఇనస్పెక్టర్ కోయ్, సీఆర్పీఎఫ్ అధికారి పాల్గొన్నారు.