తిరుమల వెళ్లే భక్తులకు భారత రైల్వే శుభవార్తను చెప్పింది. వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించింది.తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 20 ప్రత్యేక రైళ్లను నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడిరచింది హైదరాబాద్- తిరుపతి, తిరుపతి- హైదరాబాద్, తిరుపతి- కాకినాడ టౌన్, కాకినాడ టౌన్- తిరుపతి మధ్య ఈ రైళ్లు నడుస్తాయి. ఈ సర్వీసుల్లో తిరుపతి- హైదరాబాద్ మధ్య మొత్తం 10 రైళ్లు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లో ఆగుతాయని అధికారులు తెలిపారు. తిరుపతి- కాకినాడ టౌన్ మధ్య నడిచే 10 ట్రైయిన్లు.. రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. అంతేకాదు కాచిగూడ- తిరుపతి మధ్య రెండు సమ్మర్ స్పెషల్ రైళ్లు నడవనున్నాయి. జూన్ 1, జూన్ 2న ఈ సర్వీసులు నడుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లు.. ఉందానగర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట రైల్వేస్టేషన్లో ఆగుతాయని తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరారు. మరోవైపు విశాఖ- సికింద్రాబాద్, విశాఖ- మహబూబ్నగర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది రైల్వేశాఖ. ప్రయాణికుల సౌకర్యార్థం జూన్ 1 నుంచి జూన్ 29 వరకు ఈ వారాంతపు రైళ్లు పరుగులు తీయనున్నాయి. విశాఖ-సికింద్రాబాద్ రైలు జూన్ 1న రాత్రి 7 గంటలకు విశాఖలో రైలు బయలుదేరుతుంది. ట్రైన్ నెంబర్ 08579/08580.. తర్వాతి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి గురువారం సికింద్రాబాద్లో రాత్రి 7.40 గంటలకు బయలుదేరి.. విశాఖకు ఉదయం 6.40కి విశాఖకు చేరుకుటుంది.విశాఖ-మహబూబ్నగర్ రైలు ట్రైన్ నెంబర్ 08585/08586 జూన్ నెల 7 నుంచి 29 వరకు నడుస్తుంది. ప్రతి మంగళవారం విశాఖలో రాత్రి ఏడు గంటలకు బయలుదేరుతుంది.. మరుసటి ఉదయం 10.30 గంటలకు మహబూబ్నగర్ చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ప్రతి బుధవారం సాయంత్రం 6.20 గంటలకు మహబూబ్నగర్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ప్రయాణికులు ప్రత్యేక రైళ్ల సర్వీసును గమనించి ఉపయోగించుకోవాలని రైల్వేశాఖ కోరింది. వేసవి రద్దీతో రైల్వేశాఖ అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకుంది.