ఐదుగురు నిందితుల అరెస్టు
విశాలాంధ్ర`బాపట్ల/రేపల్లె : బాపట్ల జిల్లాలో మైనర్ బాలికపై సామాహిక అత్యాచార ఘటన కలకలం రేపింది. నిజాంపట్నం మండలంలో 16 ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వేమూరు మండలానికి చెందిన బాలిక… శుక్రవారం తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అదే రోజు రాత్రి ఆ బాలికను గ్రామ శివారులోని తోటల్లోకి తీసుకెళ్లి దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులంతా బాలిక స్వగ్రామానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం… కొద్దిరోజుల క్రితం బాలికకు నిందితుల్లో ఇద్దరితో పరిచయం ఏర్పడిరది. ఆమెను కలిసేందుకు 28వ తేదీ రాత్రి వారిద్దరితో పాటు మరో ముగ్గురు వచ్చారు. ఆపై తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక ఇంట్లో కనిపించక పోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రాత్రి 10 గంటల తర్వాత ఆమె ఇంటికి రావటంతో మేనమామ ఆరా తీశారు. దీంతో విషయం బయటపడిరది. ఈ ఘటనపై బాలిక బంధువులు అడవుల దీవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ ప్రారంభించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, మైనర్ బాలికపై అత్యాచారం ఘటనలో ఐదుగురు నిందితులను శనివారం సజ్జవారిపాలెం వద్ద అరెస్టు చేసినట్లు రేపల్లె డీఎస్పీ టి.మురళీకృష్ణ తెలిపారు. శనివారం స్థానిక రూరల్ సీఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడిరచారు. నిందితులపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వేమూరు మండలం పెరవలి గ్రామానికి చెందిన పద్యాల చైతన్య, జొన్నకూటి వెంకటేశ్, ఎడాలి పవన్ కుమార్, వీరంకి సతీశ్, వీరంకి వేణును అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు. సకాలంలో స్పందించి నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను డీఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో రేపల్లె రూరల్ సీఐ మల్లికార్జునరావు, పట్టణ సీఐ నజీర్ బేగ్, అడవుల దీవి ఎస్ఐ వెంకట రవి, చెరుకుపల్లి ఎస్ఐ వై.సురేశ్, సిబ్బంది వెంకటేశ్వరరావు, బాలకృష్ణ, మీరావలి, కుటుంబరావు, శ్యాంబాబు, రవి కిరణ్, ఊర్మిళ శ్రీలక్ష్మి పాల్గొన్నారు.