Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

చంద్రబాబు కేసులపై ఇవాళ‌ హైకోర్టులో విచారణ..

తమపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతల పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఎన్నికల సందర్భంగా నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండటంతో పోలీసులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనపై రాష్ట్రంలో ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయో తెలపాలని అందులో కోరారు. నమోదైన కేసుల వివరాలుౌ పోలీసు అధికారులపై నమ్మకం లేక చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రేపు న్యాయపరంగా తన నామినేషన్ కు ఇబ్బందులు కలగకుండా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆయనతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్లపై ఇవాళ‌ హైకోర్టులో విచారణ జరగనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img