Monday, May 20, 2024
Monday, May 20, 2024

విజయం చేకూర్చండి..సీపీఐ అభ్యర్థి రామచంద్రయ్య వినతి

విశాలాంధ్ర-కృష్ణగిరి: అసమర్థ పాలకులకు ఓటుతో బుద్ధి చెప్పి ప్రజల కోసం పరితపించే నాయకులను ఎన్నుకోవాలని ఇండియా కూటమి బలపరిచిన పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థి పీ రామచంద్రయ్య అన్నారు. మండల పరిధిలోని చుంచుఎర్రగుడి, సంగాల, పెనుమాడ, కంబాలపాడు, ఆగవేలి, పోతుగల్లు, మల్లాపురం తదితర గ్రామాల్లో మంగళవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. తన గుర్తు కంకి కొడవలి, కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి రాంపుల్లయ్యకు హస్తం గుర్తుకు ఓటు వేసి విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్యలపై దృష్టి సారించే నాయకులకు ఓట్లు వేసి అసెంబ్లీకి పంపించాలని, అసమర్థ అభ్యర్థులకు ఓట్లు వేయవద్దన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పాలనను గాలికి వదిలేసి స్వార్థంతో కూడిన పాలన కొనసాగిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని, వైసీపీ అభ్యర్థులను ఓడిరచి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నక్కిలేని బాబు, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజా సాహెబ్‌, సీపీఐ కోడుమూరు మండల నాయకులు రాజు, క్రిష్ణగిరి మండల సహాయ కార్యదర్శి రవి మోహన్‌, జిల్లా నాయకుడు నాగేంద్రయ్య, ఏఐవైఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు శరత్‌ కుమార్‌, ప్రజానాట్యమండలి నేత శివయ్య, మాణిక్యం, నాగరాజు వెంకట రాముడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img