Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Wednesday, October 2, 2024
Wednesday, October 2, 2024

ఎవర్నీ కావాలని అవమానించలేదు.. చేతులు జోడించి ప్రార్థిస్తున్నా

: ఏపీ సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్
ఆంధ్రప్రదేశ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. ఆయన అమరావతిలోని సచివాలయంలో కొత్త కార్యదర్శి కోన శశిధర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆ శాఖ నుంచి బదిలీపై వెళుతున్న సందర్భంగా.. ప్రవీణ్‌ ప్రకాష్‌ ఓ వీడియోను విడుదల చేశారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా గత ఏడాదిన్నరలో ఎన్నో నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు.. తాను విద్యాశాఖ పురోగతి కోసం పనిచేశానన్నారు. తాను తనిఖీలతో టీచర్లు, సిబ్బందిని అవమానించానంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు వచ్చాయని. తాను అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకే అలా మాట్లాడానని.. ఎవర్ని అవమానించేందుకు అలా చేయలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరైనా అలా భావిస్తే చేతులు జోడించి, ప్రార్థిస్తున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు. దయచేసి వాటిని మనసులో ఉంచుకోవద్దని కోరారు.. మరో మనిషిని అవమానించే గుణం తనకు లేదన్నారు.

రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌లను జీఏడీకి అటాచ్‌ చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవీణ్ ప్రకాష్ స్థానంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్‌ నియమితులయ్యారు. శశిధర్‌కు ఐటీ, ఆర్టీజీఎస్‌ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటుగా మరికొందరు ఐఏఎస్‌లను కూడా బదిలీ చేసింది ప్రభుత్వం.

తాజాగా ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ముగ్గరిలో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా నియమించింది ప్రభుత్వం. అలాగే అతుల్‌ సింగ్‌కు ఏసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించగా.. పీవీ సునీల్‌కుమార్‌ను సాధారణ పరిపాలనశాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. అగ్నిమాపకశాఖ డీజీగా శంకబ్రత బాగ్చీకి అదనపు బాధ్యతలు అప్పగించగా.. అలాగే కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ ఎస్పీ రిషాంత్‌రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే రిషాంత్ రెడ్డిని ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ బాధ్యతల నుంచీ రిలీవ్ చేశారు. ఈ మరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img