Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

ప‌వ‌న్ గెలిస్తే నా పేరు మార్చుకుంటా..: ముద్ర‌గ‌డ

జ‌న‌సేన అధినేత పవన్ క‌ల్యాణ్ ను పిఠాపురంలో నేను ఓడించకపోతే.. నా పేరు మార్చుకుంటా.. పవన్‌ను ఓడించలేకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అన్నారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. కిర్లంపూడిలో ఆయ‌న ఇవాళ‌ మీడియాతో మాట్లాడుతూ ఇక, రాష్ట్రం చంద్రబాబు తాత జాగీరు కాదన్న ఆయన.. పవన్ బూతులు మాట్లాడుతున్నార‌ని ఫైర్ అయ్యారు. తుని రైలు దహనం జరిగినప్పుడు నీ పక్కన ఉన్న నెహ్రూ వైసీపీలోనే ఉన్నార‌ని తెలుసుకో అని ప‌వ‌న్ కు సూచించారు. తుని రైలు ఘటనకి చంద్రబాబు కారణం.. ఆ విషయం పవన్ తెలుసుకోవాలన్నారు. ఇక త‌న‌ను తీహార్ జైలుకి పంపించాలని చంద్రబాబు ప్రయత్నం చేశార‌ని ఆరోపించారు. నేను చవటను దద్దమ్మనే.. అయితే .. కాపుల కోసం మీరెందుకు రోడ్డు ఎక్కలేదు ? అని నిలదీశారు ముద్రగడ.. పవన్ త‌న పై తప్పుడు మాటలు మాట్లాడుతున్నార‌ని,.. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నార‌న్నారు.. అసలు వైసీపీ కాపు ఎమ్మెల్యేలను తిట్టడానికి పవన్ కి ఉన్న హక్కు ఏంటి ? అని నిలదీశారు. ఉద్యమానికి ఎప్పుడూ మద్దతు ఎందుకు ఇవ్వలేదన్న ఆయన.. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం ఎందుకు పారిపోయి వచ్చారు ? అసలు పవన్ అడ్రెస్ ఏంటి ? ఎక్కడ పుట్టాడు..? అని ప్రశ్నించారు.తెలంగాణలో మీరు పెట్టిన అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు కదా ? అని ఎద్దేవా చేశారు. ఇక, పవన్ ను పిఠాపురంలో తాను ఓడించకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానన్న ఆయన.. సినిమాలలో నటించండి.. రాజకీయాల్లో కాదు అని సూచించారు. ఎన్నిక‌ల త‌ర్వాత జ‌న‌సేన పార్టీ ఫ్యాకప్ త‌ధ్య‌మ‌న్నారు. పిఠాపురంలో నిన్ను తన్ని తరిమేస్తారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.1978లో చంద్రబాబుకి ఇంటి పెంకులు మార్చుకోవడానికి కూడా స్తోమత లేద‌ని అంటూ .. రెండు ఎకరాలు నుంచి అపర కోటీశ్వరుడు ఎలా అయ్యాడు ? అని ప్రశ్నించారు. ఇక, చిరంజీవి కూటమికి మద్దతు ఇచ్చినా ఎటువంటి ప్రయోజనం ఉండదన్న ఆయన.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు బయటకు వస్తే గౌరవిస్తార‌న్నారు.. ఏపీకి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, పోలవరం గురించి చిరంజీవి ఎందుకు బయటకు రాలేదు..? అని నిలదీశారు. అయితే, ఇప్పుడు ప‌వ‌న్ కు మద్దతుగా చిరంజీవి వీడియోలు రిలీజ్ ఇస్తే ప్రజలు నమ్ముతారా ? అని నిలదీశారు ముద్రగడ పద్మనాభం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img