సీఎం జగన్ తో భేటీ అయిన ఉద్యోగ సంఘాల నేతలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… ఉద్యోగులు సంతోషంగా ఉండటమే తమకు ముఖ్యమని ముఖ్యమంత్రి అన్నారు. ఉద్యోగుల్ని సంతోషంగా ఉంచడానికి ప్రతి కార్యక్రమం మనసా, వాచా కర్మేణా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని అన్నారు.ఉద్యోగులు ఆనందంగా ఉంటేనే డెలివరీ మెకానిజం బాగుంటుందని, ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పారు. ప్రతి ఉద్యోగిని సంతోషంగా ఉంచడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల ప్రతి సమస్యలకు పరిష్కారం చూపించాలని యత్నిస్తున్నామని చెప్పారు. జీపీఎస్ కోసం రెండేళ్లపాటు కసరత్తు చేశామని, ఈ మోడల్ దేశానికే ఆదర్శమవుతుందని సీఎం అన్నారు. రిటైర్ అయిన ఉద్యోగుల జీవన ప్రమాణాలను కాపాడినట్టు అవుతుందని చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలన్నీ 60 రోజుల్లోగా అమల్లోకి రావాలని అధికారులను ఆదేశించారు.