చంద్రబాబుకు కొడాలి నాని సవాల్
గుడివాడ మునిసిపాలిటీ పరిధిలోని మల్లాయపాలెంలో టిడ్కో ఇళ్లను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబుపై మండిపడ్డారు. గుడివాడ వచ్చి చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతారని.. ఎన్టీఆర్ సొంత గ్రామానికి చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. చంద్రబాబు హయాంలో వేసిన రోడ్లు 3 నెలలకే గోతులమయంగా మారేవి అన్నారు. గుడివాడ ప్రజలకు దాహార్తి తీర్చిన మహానుభావుడు దివంగత వైఎస్సార్.. చంద్రబాబు మాట తాను వింటే చరిత్రహీనుడిని అయ్యేవాడిని అన్నారు. గుడివాడ ప్రజల కోసం చంద్రబాబు ఒక ఎకరం కొనుగోలు చేసినా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నారు. గుడివాడలో పేదలకు ఇళ్ల నిర్మాణం దివంగత వైఎస్సార్ రాజశేఖరరెడ్డి చలవే అన్నారు. రూ.800 కోట్ల ప్రాజెక్టుకు చంద్రబాబు చెల్లించిన డబ్బు రూ. 180 కోట్లు. అందులో రూ.160 కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి రూ. 400 కోట్లు జగన్ సర్కార్ ఇచ్చిందని అన్నారు రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుపేదలకు లక్ష ఎకరాలను ఇంటి స్థలాల కింద ఇచ్చిన సీఎం జగన్.. రాష్ట్రంలో నిరుపేదలకు రూ.15 లక్షల కోట్లు సీఎం జగన్ వెచ్చిస్తున్నారన్నారు. గతంలో ఇళ్ల సమస్యలపై వైఎస్సార్ అడిగానని.. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అయినా సరే స్పందించారన్నారు. ప్రజలకు సీఎం జగన్ మేలు చేస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్. పేద ప్రజల మీద టీడీపీకి ప్రేమ లేదని.. ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్లారని.. సీఎం జగన్ సంకల్పం ముందు ఆ కుట్రలు కొట్టుకుపోయాయి అన్నారు. జగనన్న సంకల్పం ముందు దుష్టశక్తుల శక్తులన్నీ పటాపంచలయ్యాయని.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చంద్రబాబు గాలికి వదిలేశారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో దోపిడిని అనుకూల మీడియా ప్రశ్నించదన్నారు. సీఎం జగన్ ప్రభంజనంతో టీడీపీలో వణుకు పడుతోందని.. అన్ని హంగులతో టిడ్కో ఇళ్లను సీఎం జగన్ పూర్తి చేశారని.. నాయకుడు ఎలా ఉంటాడనే వారిని ఉదాహరణ సీఎం జగన్ అన్నారు.
కృష్ణా జిల్లా గుడివాడ మునిసిపాలిటీ పరిధిలోని మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్లను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. మరో 178.63 ఎకరాల్లో సిద్ధం చేసిన 7,728 మందికి ఇళ్ల పట్టాలు, కడుతున్న 4,500 ఇళ్లకు పట్టాలను పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,43,600 మంది లబ్ధిదారులకు 300 చ.అ. టిడ్కో ఇళ్లను ప్రభుత్వం అందజేస్తోంది.