Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఆర్టీసీ బస్సు-లారీ ఢీ…22 మందికి గాయాలు

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌ రోడ్డులో యాక్సిడెంట్‌ సంభవించింది. సోమవారం ఉదయం భద్రాచలం నుంచి కాకినాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు..చత్తీస్‌గఢ్‌ వైపు వెళుతున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. వాలమూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్‌ రామకృష్ణ,కండక్టర్‌ రమేష్‌ తో కలిపి 22 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని మారేడుమిల్లి ఆసుపత్రికి తరలించారు.అక్కడ ప్రథమ చికిత్స అనంతరం రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. మారేడుమిల్లి పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img