Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

జనవరి 27న నారా లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం

పాదయాత్రకు ‘యువ గళం’గా నామకరణం
కుప్పం నుంచి ప్రారంభమై 4 వేల కిలోమీటర్లు కొనసాగనున్న యాత్ర

వచ్చే ఎన్నిల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టనున్న సంగతి తెలిసిందే. పాదయాత్రకు ‘యువ గళం’ అనే పేరును ఖరారు చేశారు. జనవరి 27న కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. 100 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. యువత, మహిళలు, రైతుల సమస్యలను ప్రతిబింబించేలా పాదయత్రను నిర్వహించనున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా పాదయాత్ర కొనసాగనుంది. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో పాదయాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img