London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

త్వరలో ప్రజలకు సౌకర్యవంతమైననూతన ఇసుక పాలసీ

. అవినీతి, అక్రమాలకు తావుండరాదు
. తక్షణమే నిర్మాణరంగానికి చేయూత
. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు చర్యలు
. రోడ్ల మరమ్మతులతో ప్రజల ఇబ్బందులు తొలగించాలి
. మూడు కీలక శాఖల సమీక్షలో చంద్రబాబు ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అవినీతి, అక్రమాలకు అస్కారం లేకుండా ప్రజలకు సౌకర్యవంతంగా నూతన ఇసుక పాలసీపై తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీ, దెబ్బతిన్న రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సచివాలయంలో ఆయా శాఖల మంత్రులు, అధికారులతో మంగళవారం సీఎం సమీక్షలు నిర్వహించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. దీనికి అవసరమైన రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్యల తీవ్రత దృష్ట్యా తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీర్ఘకాలికంగా ఎటువంటి ప్రణాళికలు అమలు చేయాలి అనే విషయంపై నిర్ధిష్టమైన విధానాలతో అధికారులు పనిచేయాలని సీఎం ఆదేశించారు.
ఇసుక లభ్యత..నూతన ఇసుక పాలసీపై సమీక్ష
రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీపై సీఎం సమీక్షించారు. 2014 నుంచి 2019 వరకు ఇసుక సరఫరాలో అమలు చేసిన పాలసీలను, ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన విధానాలను అధికారులు వివరించారు. 2016లో తెచ్చిన ఉచిత ఇసుక పాలసీ వల్ల వచ్చిన ఫలితాలు…తరువాత వైసీపీ ప్రభుత్వం పాలసీలు మార్చడం వల్ల జరిగిన నష్టాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వ విధానాలతో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొందని అధికారులు వివరించారు. ఇసుక క్వారీల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, ప్రైవేటు వ్యక్తులు, ఏజెన్సీలకు ఇసుక క్వారీలు అప్పగించడంతో సరఫరా, అమ్మకాల్లో ఇబ్బందులు వచ్చాయని అధికారులు తెలిపారు. సీసీ కెమెరాలు, జీపీఎస్‌ ట్రాకింగ్‌, ఆన్‌లైన్‌ విధానం సరిగా లేకపోవడం వల్ల అక్రమాలు జరిగాయని అధికారులు అన్నారు. ప్రైవేటు ఏజెన్సీలు ఎంత మేర తవ్వకాలు జరిపాయి, ఎంత మేర అమ్మకాలు జరిపాయనే విషయంలో కూడా ఎటువంటి పరిశీలన, పర్యవేక్షణ జరగలేదని తెలిపారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ…తక్షణం నిర్మాణ రంగానికి ఇసుకను అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చూడాలని అన్నారు. ప్రస్తుతం స్టాక్‌ పాయింట్లలో అందుబాటులో ఉన్న ఇసుకను సరఫరా చేసేందుకు ఉన్న వెసులుబాటు చూడాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా నూతన ఇసుక పాలసీ రూపొందించాలన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇసుక విషయంలో ఎటువంటి అక్రమాలు, అవినీతికి అవకాశం లేని…ప్రజలకు ఇబ్బందులు కలిగించని పాలసీ తీసుకొస్తామన్నారు.
రహదారుల దుస్థితిపై…
అనంతరం రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని సీఎం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో రోడ్లన బాగు చేయడం ఒక విధానం అయితే…తక్షణం ప్రజల కష్టాలు తీర్చేందుకు రహదారులపై గుంతలు పూడ్చడం, వెంటనే మరమ్మతులు చేయాల్సిన రోడ్లపై ఫోకస్‌ పెట్టాలని సూచించారు. ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు…ఏ మేర దెబ్బతిన్నాయి అనే విషయంలో సత్వరమే నివేదికలు సిద్ధం చేయాలన్నారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి సాంకేతికంగా అందుబాటులోకి వచ్చిన కొత్త విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నప్పటికీ వెంటనే మరమ్మతులు చేయాల్సిన రోడ్లపై ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఆర్థిక సమస్యలు ఉన్నా…ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యం ఇస్తామని సీిఎం అన్నారు.
నిత్యావసర ధరల భారం తగ్గించాలి
నిత్యావసర సరుకుల భారం తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలపై వ్యవసాయ శాఖ, మార్కెటింగ్‌ శాఖ, పౌరసరఫరాల శాఖ అధికారులు, మంత్రులతో సమీక్ష చేశారు. బియ్యం, కందిపప్పు, టమోటా, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష చేశారు. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక కంది పప్పు ధర అంతకంతకూ పెరుగుతోందని అధికారులు తెలిపారు. టమోటా, ఉల్లిపాయల ధరలు ఒక్కోసారి అనూహ్యంగా పెరగడం వల్ల ప్రజలపై భారం పడుతోందని అధికారులు వెల్లడిరచారు. ధరల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలనేదానిపై ప్రణాళికతో రావాలని సీిఎం సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 122 రైతు బజార్లు ఉన్నాయని అధికారులు చెప్పగా… వాటి నిర్వహణ సరిగా లేక వాటి ఏర్పాటు వెనుక ఉద్దేశం నెరవేరడం లేదని చంద్రబాబు అన్నారు. ఈ మూడు సమీక్షలలో మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్‌ రెడ్డి, కె.అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్‌తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img