Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

రక్షణ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో విశాఖది కీలక పాత్ర.. మోదీ

రక్షణ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో విశాఖది కీలక పాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం ఏయూ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ,టెక్నికల్‌, మెడికల్‌ రంగం ఏదైనా ఏపీ ప్రజలు ప్రత్యేకతను కనబరుస్తున్నారన్నారు. ఏపీ ప్రజల ఉన్నత వ్యక్తిత్వం వారిని ప్రత్యేకంగా నిలుపుతోందన్నారు. తెలుగు ప్రజలు అందరి బాగుకోసం పాటుపడుతారన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. రైల్వేలు, రోడ్లు, పోర్టుల డెవలప్‌ మెంట్‌ లో సందేహపడటం లేదన్నారు. బహుముఖ రవాణా వ్యవస్థ ప్రతి నగర భవిష్యత్తు అన్నారు. విశాఖ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img