న్యూదిల్లీ: ఎంజి మోటార్ ఇండియా తన ఇవి పోర్ట్ ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ, ఆశ్చర్యపరిచే విలువ ప్రమేయాల ద్వారా ఎంజి ఇవిలను మరింతగా అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. ఈ కార్ల తయారీ కంపెనీ తన ప్రధాన ఉత్పత్తి అయన ఇవిల్లో క్రొత్త రూపాంతరం అయిన ఎక్సైట్ ప్రొ-ఎంజి జెడ్ఎస్ను, డ్యూయల్ పేన్ పనోరమిక్ స్కై రూఫ్తో, రూ.19.98 లక్షల ఆకర్షణీయమైన ధరకు అందుబాటులోకి తెస్తోంది. ఇంకా, ఎంజి మోటార్ ఇండియా -ఫాస్ట్ ఛార్జింగ్ అవకాశంతో ఎక్సైట్, ఎక్స్క్ల్లూసివ్ అనే రెండు కొత్త రూపాంతరాల్లో ఎంజి కామెట్ను అందుబాటులోకి తెస్తోంది. స్మార్ట్ ఇవి – ఎంజి కామెట్ శ్రేణి రూ.6.98 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. భారతదేశపు మొదటి ఎలెక్ట్రిక్ ఎస్యువి, పవర్-పాక్డ్ మొబిలిటీ అనుభవాన్ని ఇస్తుంది. 75 కంటే ఎక్కువ ఫీచర్లతో, 50.3 కెడబ్ల్యుహెచ్ ప్రిస్మాటిక్ సెల్ ఐపి69కె రేటెడ్ విభాగంలో, ఎఎస్ఐఎల్-డి అండ్ యుఎల్ 2580 బాటరీతో, ఒక్క ఛార్జింగ్తో 461 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్తో, తక్కువ ఖర్చుతో గొప్ప ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ విభాగంలో మొదటిసారిగా జెడ్ఎస్ ఇవి-డిజిటల్ కీ లాకింగ్ను అందిస్తుంది. దీనివల్ల కస్టమర్ ఫిజికల్ కీ లేకుండానే కారు స్టార్ట్ చేసి నడపొచ్చు. డ్రైవింగ్ అనుభవం, ప్రయాణీకుల భద్రతలను మరింత మెరుగుపరిచే విషయంలో ఎడిఎఎస్ లెవెల్ 2తో వస్తుంది.