గురుగ్రామ్: భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్ తాజాగా శాంసంగ్ వాలెట్ పై విమాన, బస్సు, సినిమా, ఈవెంట్ల టిక్కెట్ బుకింగ్లను, భారతదేశపు ప్రముఖ చెల్లింపులు, ఆర్థిక సేవల పంపిణీ సంస్థ పేటిఎం బ్రాండ్ను కలిగి ఉన్న ఒన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ప్రారంభించింది. శాంసంగ్ వాలెట్ ద్వారా నేరుగా సౌకర్యవంతమైన, ఇంటిగ్రేటెడ్ బుకింగ్ అనుభవాన్ని అందించడం ద్వారా వినియోగదారుల సౌకర్యాన్ని మెరుగుపరచడం ఈ భాగస్వామ్యం లక్ష్యం, పేటిఎం ద్వారా విస్తృత శ్రేణి సేవలకు ప్రాప్యతను ఇది సులభతరం చేస్తుంది. ఈ భాగస్వామ్యంతో, గెలాక్సీ స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఇప్పుడు విమానాలు, బస్సు బుకింగ్లు, సినిమా టిక్కెట్ల కొనుగోళ్లు, ఈవెంట్ బుకింగ్లతో సహా పేటిఎం సూట్ సేవలకు సౌకర్యవంతమైన యాక్సెస్ను కలిగి ఉంటారు, ఇవన్నీ శాంసంగ్ వాలెట్లో విలీనమయ్యాయి. విమాన, బస్సు, సినిమా బుకింగ్ల కోసం పేటిఎం యాప్ని, ఈవెంట్ బుకింగ్ల కోసం పేటిఎం ఇన్సైడర్ యాప్ని ఉపయోగించే గెలాక్సీ స్మార్ట్ఫోన్ వినియోగదారులు ‘యాడ్ టు శాంసంగ్ వాలెట్‘ ఫంక్షనాలిటీని ఉపయోగించి నేరుగా శాంసంగ్ వాలెట్కి తమ టిక్కెట్లను జోడిరచగలరు.