న్యూదిల్లీ: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, తెలంగాణలోని 33 జిల్లాల్లో విస్తరించిన తన 430 శాఖలు, 542 బీసీల ద్వారా రూ.10 నాణేల స్వీకరణపై రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ (పిఎసి) నిర్వహించింది. రూ.10 నాణేల చట్టపరమైన చెల్లుబాటుకు సంబంధించి ఉన్న అపోహలను తగ్గించడం, రూ.10 నాణేలపై ఎక్కువ నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడే ఉద్దేశంతో పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ రిజర్వు బ్యాంకు, హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం సహకారాన్ని అందించింది. ఈ క్యాంపెయిన్లో బ్యాంక్ మొత్తం రూ.10.96 లక్షల విలువైన రూ.10 నాణేలను పంపిణీ చేసింది/మార్పిడి చేసింది. ఈ కార్యక్రమాన్ని మొదటిగా తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకు నిర్వహించింది. గత ఏడాది రూ.16.90 లక్షల విలువైన రూ.10 నాణేలు పంపిణీ చేయబడ్డాయి/మార్పిడి చేయబడ్డాయి.