విశాలాంధ్ర/హైదరాబాద్: భారతదేశంలో ప్రముఖ ఈవి ఛార్జర్ తయారీ సంస్థ సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) నుండి 1800 డీసీ ఫాస్ట్ ఈవి ఛార్జర్ల కోసం ప్రధాన ఆర్డర్ను పొందినట్లు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. రూ.120 కోట్ల విలువైన ప్రాజెక్ట్లో సర్వోటెక్ తయారీ, సరఫరా, వ్యవస్థాపన వ్యూహాత్మకంగా ఈ 1800 ఈవి ఛార్జర్లను దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ప్రధాన నగరాల్లోని బిపిసిఎల్ పెట్రోల్ పంపుల వద్ద, బిపిసిఎల్ ఈ-డ్రైవ్ ప్రాజెక్ట్లో భాగంగా అమలు చేస్తామన్నారు. విస్తృతమైన ఈవి ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడంలో ఈ చర్య కీలకమైన దశగా తెలియజేసారు. ప్రాజెక్ట్ 60 కెడబ్ల్యు 120 కెడబ్ల్యు రెండు ఛార్జర్ వేరియంట్లను కలిగిన ఈ విస్తృతమైన ప్రాజెక్ట్ను 2024 చివరి నాటికి పూర్తి చేయాలని సర్వోటెక్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇది దేశం అభివృద్ధి చెందుతున్న ఈవి పర్యావరణ వ్యవస్థకు దోహదం చేస్తుందన్నారు.