హైదరాబాద్ : ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా పూజా కార్యక్రమం గురువారం ఉదయం హైదరాబాద్లో వేడుకగా జరిగింది. దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొని ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. పూజా కార్యక్రమం అనంతరం.. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. చిత్రబృందానికి స్క్రిప్ట్ను అందజేశారు. ‘ఎన్టీఆర్30’ పూజా కార్యక్రమంలో జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిత్రబృందంతో ఆమె కలివిడిగా కనిపించారు. తన అభిమాన నటుడు ఎన్టీఆర్ని కలిసిన సమయంలో ఆమె ఆనందం మరోస్థాయిలో ఉంది. ఎన్టీఆర్ పలకరించగా.. ఆమె ఎంతో ఆనందించారు. కాసేపు సరదాగా మాట్లాడారు. అలాగే రాజమౌళితోనూ ఆమె ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, కొరటాల శివ, జాన్వీకపూర్, ప్రకాశ్రాజ్, శ్రీకాంత్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సంగీత దర్శకుడు అనిరుధ్, నిర్మాత కల్యాణ్ రామ్ తదితరులు సందడి చేశారు.