హైదరాబాద్ : సూపర్స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్పై ఉంది. ఇటీవల ఈ సినిమా స్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు సంక్రాంతి రేసులోంచి తప్పించడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ 1న విడుదల చేయబోతున్నట్టు ట్విట్టర్ వేదికగా నిర్మాతలు ప్రకటిం చారు. వచ్చే ఏడాది సమ్మర్కు రాబోతోన్న పెద్ద చిత్రం ఇదే. ఈ సినిమాకు వేసవి సెలవులు కలిసి రానున్నాయి. హాలీడే సీజన్లో విడుదలైన మహేష్ బాబు పోకిరి, భరత్ అనే నేను, మహర్షి వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. ఇప్పటికే రిలీజైన టీజర్కు అద్భు తమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రయూనిట్ ప్రమో షన్ కార్యక్రమాలను వేగవంతం చేయనుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల మీద నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయు క్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇందులో సముద్రఖని విలన్గా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.