Monday, May 6, 2024
Monday, May 6, 2024

ఇద్దరం కడుపులో ఉండగానే కలుసుకున్నాం

బెంగళూరు : తమిళ హీరో సూర్య, ఇటీవల మరణించిన కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ స్మారక చిహ్నం వద్ద నివాళి అర్పించి భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం ఆయన బెంగుళూరులోని పునీత్‌ సమాధిని సందర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీ త్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘పునీత్‌ హఠాన్మరణాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. పునీత్‌ ఇక లేరన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. మా కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంది. మా నాన్న, రాజ్‌కుమార్‌ కుటుంబం గురించి తరచూ చెబుతుండేవారు. పునీత్‌ అమ్మగారు.. మా అమ్మ ఇద్దరూ గర్భిణీలుగా ఉన్న సమయంలో మొదటి సారి కలిశారట. అలా మేము అమ్మ కడుపులో ఉండగానే కలుసుకున్నాం. వాళ్లు కూడా పునీత్‌ చనిపోయాడన్న విషయాన్ని నమ్మలేకపోతున్నారు. తను చేసిన మంచి పనులు, తన జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. అయితే తనను చాలా మిస్‌ అవుతా’’ అని సూర్య అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img