హైదరాబాద్ : ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో రూపొందిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘సీటీమార్’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. గోపిచంద్ కెరీర్లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికేట్ను పొందింది. సెన్సార్ పూర్తయిన సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. ‘మా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్తో అన్ కాంప్రమైజ్డ్గా నిర్మించిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’ చిత్రం అన్నారు.