చెన్నై : హీరోయిన్లు ఎన్ని అద్భుతమైన పాత్రలు చేసినా.. ఇంకా ఏదో చేయాలి.. నిరూపించుకోవాలి.. అనుకుంటారు. ఇంకా చెప్పాలంటే ప్రతి కథానాయికకు ఓ డ్రీమ్ రోల్ తప్పనిసరిగా ఉంటుంది. కొన్ని కోరికలూ ఉంటాయి. శ్రుతీహాసన్ గురించి చెప్పుకొంటే పెద్ద లిస్టే ఉంటుంది. కథానాయికగా, సింగర్గా, మ్యుజీషియన్గా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు సంగీత ప్రపంచంలో సంగీత కళాకారులకు ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయనే నేపథ్యంలో సినిమా చేయాలని కోరిక. అలాంటి కథ కోసం ఎదురుచూస్తున్నాననీ కుదిరితే ఆ కథ తనే రాయొచ్చని ఓ సందర్భంలో తెలిపారు. అంతే కాదు ఆమెకు కొన్ని చిలిపి కోరికలూ ఉన్నాయి. చెన్నై అమ్మాయి అయినప్పటికీ ముంబైలో ఉంటారు శ్రుతీ. అయితే అక్కడ సౌతిండియన్ ఫుడ్ను చాలా మిస్ అవుతున్నారట. అందుకే ముంబైలో తన అభిరుచికి తగ్గట్లు ఓ సౌతిండియన్ రెస్టారెంట్ నెలకొల్పాలని తన మనసులో ఉన్న కోరికను బయట పెట్టారు. ఇటీవల చెన్నై మీడియాతో మాట్లాడిన ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడిరచారు. ‘నాకు వంటకం మీద మంచి పట్టుంది. బాగా వండుతాను, నలుగురికి మంచి రుచుల్ని చూపించడమంటే నాకు ఇష్టం అన్నారు.