హైదరాబాద్ : దేవకట్టా దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా ‘రిపబ్లిక్’. పొలిటికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కిన ఈ మూవీ త్వరలో డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. ఈ మూవీ అక్టోబర్ 1న థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. జే బీ ఎంటర్టైన్మెంట్స్ – జీ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మించిన ఇందులో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.. జగపతి బాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. మెలోడి బ్రహ్మ మణి శర్మ సంగీతం అందించారు. కాగా ‘రిపబ్లిక్’ మూవీ జీ 5 లో నవంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు తాజా సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన జీ 5 నుంచి రానున్నట్టు తెలుస్తోంది.