విశాలాంధ్ర- ఉంగుటూరు ( ఏలూరు జిల్లా): గణపవరం రహదారి ఉంగుటూరు మండలం రావులపర్రు మురుకు కోడు వంతెన బీటల వారి గోతులమయంగా మారింది. కోట్లాది నిధులతో ఈ వంతెన నిర్మించడం జరిగింది. వంతెన బీటల వారటానికి ప్రధాన కారణం వంతెన పక్కన ఉన్న మంచినీటి ప్రాజెక్టుకు సంబంధించి పైపులైను లీకేజీ వలనే వంతెన పాడైపోతుంది . పైపులైను ఎన్నో సంవత్సరాల నుండి లీకేజీ అవుతున్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోలేదు. ఈ లీకేజీ కారణంతో వంతెన రోజు రోజుకు పాడైపోతుంది. రోజురోజుకు వంతెన పాడైపోవడంతో వాహనదారులు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వంతెన పాడైపోయిన ఇప్పటికీ కూడా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవటం లేదని ప్రయాణికులు వాహనదారులు అంటున్నారు. ఈ రహదారి గుండా భీమవరం, ఏలూరు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఇప్పటికైనా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆర్ అండ్ బి శాఖ వారు పట్టించుకోవాలని ప్రజల కోరుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ వారు లీకేజీ అవుతున్న పైపులైను వెంటనే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే దెబ్బతిన్న రోడ్డును మరమ్మతులు చేయాలని కూడా ప్రజలు కోరుతున్నారు.