ఐఏఎస్లకు క్యాట్లో చుక్కెదురు
నేడు రిపోర్ట్ చేయాలని ఆదేశం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ‘ఏపీ ప్రజలు వరదలతో ఇబ్బందులకు గురవుతుంటే… అక్కడకు వెళ్లి సేవ అందించాలని మీకు లేదా?’ అంటూ ఐదుగురు ఐఏఎస్లపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) కీలక వ్యాఖ్యలు చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. తెలంగాణ ఐఏఎస్లు ఏపీకి, ఏపీ ఐఏఎస్ తెలంగాణకు వెళ్లాల్సిందేనని, బుధవారం రిపోర్ట్ చేయాలని స్పష్టంచేసింది. క్యాట్ తీర్పుతో తెలుగు రాష్ట్రాల్లో చర్చ కొనసాగు తోంది. డీఓపీటీ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్లు వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణిప్రసాద్, రోనాల్డ్రాస్ ఏపీకి రావాల్సి ఉంది. రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ సృజన తెలంగాణకు వెళ్లాల్సి ఉంది. ఈనెల 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం జారీజేసిన ఉత్తర్వులు రద్దు చేయాలని ఐఏఎస్లు క్యాట్ను ఆశ్రయించారు. తమకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై మంగళవారం విచారణ కొనసాగగా… వారి అభ్యర్థనను క్యాట్ త్రోసిపుచ్చింది. స్థానికత ఉన్నప్పటికీ స్వాపింగ్ చేసుకునే అవకాశం మార్గదర్శకాలలో ఉందా? రాష్ట్రంలో ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతున్నారని, అక్కడకు వెళ్లి సేవ చేయాలని మీకు లేదా? అని ప్రశ్నించింది. ఐఏఎస్ల కేటాయింపులపై డీఓపీటీకి పూర్తి అధికారాలున్నాయని క్యాట్ సమర్థించింది. అటు ఏకస్య కమిటీ సిఫార్సులను డీఓపీటీ పట్టించుకోవడం లేదని ఐఏఎస్ల తరపు న్యాయవాది క్యాట్ దృష్టికి తీసుకొచ్చారు. కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్రం ఉత్తర్వులు జారీజేసే ముందు… కమిటీ నివేదిక ఇవ్వలేదని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని రెవెన్యూ విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలో ఉన్న మత్స్యకారులంతా వెనక్కి రావాలని సూచించారు. ప్రజా రవాణా, రైళ్ల రాకపోకలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని వాతావారణ శాఖ సూచనలు జారీ చేసింది. విపత్తుల నిర్వహణ శాఖ కార్యాలయాన్ని సందర్శించిన హోం మంత్రి వంగలపూడి అనితకు సిసోడియా తాజా పరిస్థితులను వివరించారు.
వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం
బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడే అవకాశమున్నందున వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నందున ముందస్తు చర్యల్ని తీసుకున్నది. ఈ మేరకు ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె.పద్మావతి తెలిపారు. సంబంధిత జిల్లాల్లోని ఎపిడెమిక్ సెల్స్ 24 గంటలూ అందుబాటులో ఉండటంతో పాటు నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆమె చెప్పారు. పునరావాస శిబిరాల వద్ద వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేశారని, గర్భిణిలకు ప్రసవ తేదీకి వారం రోజుల ముందుగా అన్ని సదుపాయాలున్న ప్రభుత్వాసుపత్రులకు తరలిస్తున్నట్లు తెలిపారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో అక్కడి ఎపిడెమిక్ సెల్ నంబరును ప్రజలకు తెలియజేయాలని, రాష్ట్ర ఎపిడెమిక్ సెల్ నంబరు (9032384168)తో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాలు సమన్వయం చేసుకోవాలని పద్మావతి సూచించారు.