ఎట్టకేలకు రిలీవ్ అయిన ఏడుగురు అధికారులు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్లకు ఊరట దక్కలేదు. వారి పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. తక్షణమే ఆయా రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని ఐఏఎస్లను ఆదేశించింది. ప్రజాసేవ కోసమే ఐఏఎస్లు ఉన్నారని, ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడకు వెళ్లాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. డీఓపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు వాణిప్రసాద్, వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. రిలీవ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ఐఏఎస్ల పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. దీంతో అధికారులు ఇరు రాష్ట్రాల నుంచి రిలీవ్ అయ్యారు. ఏపీకి చెందిన ఐఏఎస్లు సృజన, హరికిరణ్, శివశంకర్ బుధవారం హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి రిపోర్ట్ చేశారు. ఇక తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లవలసిన వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి కూడా తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యారు.
ఈనెల 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం జారీజేసిన ఉత్తర్వులు రద్దు చేయాలని ఐఏఎస్లు క్యాట్ను ఆశ్రయించగా… ఈనెల 15వ తేదీన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ విభాగం(డీఓపీటీ) ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది.
తెలంగాణ ఐఏఎస్లు ఏపీకి, ఏపీ ఐఏఎస్లు తెలంగాణకు వెళ్లాల్సిందేనని, రిపోర్ట్ చేయాలని స్పష్టంచేసింది. తమకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా క్యాట్ తిరస్కరించింది. కాగా క్యాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్లకు ఊరట దక్కకపోవడంతో వారంతా ఆయా రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిరది.