. ప్రపంచబ్యాంకు నిధుల విడుదలకు కేంద్రం సహకారం
. విశాఖ రైల్వేజోన్కు త్వరలో శంకుస్థాపన
. బందరు`హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే ప్రతిపాదించాం
. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ను పీఎంకు వివరించా
. దిల్లీలో మీడియాతో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు వచ్చేలా సహకరించాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని కోరామని, డిసెంబరులో రహదారులతో పాటు అన్ని రకాల నిర్మాణాలు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. రెండు రోజుల దిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి, వరుస సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. తొలిరోజు ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో భేటీ అయిన చంద్రబాబు, మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, హర్దీప్సింగ్ పూరీ, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో వరుసగా సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు పూర్తయిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గడిచిన ఐదేళ్లలో జరిగిన విధ్వంసం గురించి ప్రధాని మోదీకి వివరించినట్లు సీఎం తెలిపారు. గత ఐదేళ్లలో కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని ప్రధానికి వివరించానన్నారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ గురించి ప్రధానికి సమగ్రంగా వివరించానని, దీని అమలుకు సహకరించాలని కోరానని తెలిపారు. పోలవరం డయాఫ్రం వాల్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. రాష్ట్రంలోని జాతీయ రహదారుల పెండిరగ్ పనులు పూర్తి చేయాలని ప్రధానిని కోరాను. కేంద్రం నుంచి రావాల్సిన గ్యాస్ రాయితీ గురించి వివరించాను. విశాఖ రైల్వే జోన్ గురించి మంత్రి అశ్వినీ వైష్ణవ్తో మాట్లాడాను. విశాఖ రైల్వే జోన్కు భూమి ఇవ్వలేక గత ప్రభుత్వం ఐదేళ్లు కాలయాపన చేసింది. మేం వచ్చాక వెంటనే భూ కేటాయింపుల ప్రక్రియ పూర్తి చేశాం. దీంతో త్వరలోనే విశాఖ రైల్వే జోన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. రద్దీ ఉన్న ప్రాంతాల్లో నాలుగు లైన్లు రహదారులు వేయాలని రైల్వే మంత్రిని కోరాను. అమరావతి నుంచి విజయవాడకు కొత్త రైల్వే లైను, మచిలీపట్నం నుంచి రేపల్లెకు రైల్వే లైన్ అనుసంధానించాలని కోరాను. నరసాపురంమచిలీపట్నం, రేపల్లె-బాపట్ల లైన్లు ఇవ్వాలని కోరామని చంద్రబాబు వివరించారు. నడికుడి
శ్రీకాళహస్తి, కోటిపల్లి-నరసాపురం మధ్య రైల్వే లైన్లు ఇవ్వాలని, కొన్ని రైల్వే లైన్లకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని కోరాం. రాష్ట్రంలో రూ.75 వేల కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయి. 2027లోగా బుల్లెట్ రైలు పనులు కూడా ప్రారంభం కావొచ్చు. ఐటీ లిటరసీ, డిజిటల్ హబ్ పెట్టాలని, డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరాం. వచ్చే అవకాశం ఉంది. ఏఐ సాయంతో వచ్చే స్టార్టప్లను మరింత ప్రోత్సహిస్తాం. క్లౌడ్లో ఉన్న నాలెడ్జ్ను పూర్తిగా వినియోగించుకుంటామని చంద్రబాబు వెల్లడిరచారు..
హైదరాబాద్-మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రోడ్డుకు ప్రతిపాదన
హైదరాబాద్ నుంచి మచిలీపట్నంకు ఎక్స్ప్రెస్ రోడ్డు ప్రతిపాదించగా, కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారని చంద్రబాబు తెలిపారు. బందరు పోర్టు నిర్మాణం పూర్తయితే రెండు రాష్ట్రాల మధ్య మరింత పెరగనున్న వాహనాల రద్దీ దృష్ట్యా, ఎక్స్ప్రెస్ హైవే ఆవశ్యతను తెలియజేశామన్నారు. అలాగే భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే బీచ్ రోడ్డును విస్తరిస్తాం. విమానాశ్రయానికి హైవే, బీచ్రోడ్డు, మెట్రో ద్వారా రాకపోకలు సాగించే విధంగా అభివృద్ధి చేస్తాం. సివిల్ ఏవియేషన్ వర్సిటీ ఏర్పాటు చేసే యోచన ఉందని చంద్రబాబు వివరించారు. సీఎం చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, భరత్, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులు ఉన్నారు.