సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
న్యూదిల్లీ: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా శనివారం కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తానేదో నియంతనని ఆయన అనుకుంటున్నట్లు ఉన్నారని గవర్నర్ తీరును ఆక్షేపించారు. ఈ వ్యవహారంలో రాష్ట్రపతి జోక్యాన్ని కోరారు. గవర్నర్గిరి సాగనివ్వరాదన్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ద్వేషాన్ని రెచ్చగొట్లేలా వ్యవహరిస్తున్నారని రాజా దుయ్యబట్టారు. గవర్నర్ పదవిలో ఉన్న విషయాన్ని మరిచి ఏదైనా చేయొచ్చు. నేను నియంతను అని ఆయన అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రవిని గవర్నర్ పదవి నుంచి రీకాల్ చేయాలి డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, గవర్నర్గా రవిని తొలగించాలని రాష్ట్రపతికి రాజా విజ్ఞప్తి చేశారు. అలాగే తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి సీపీఐ తరపున మద్దతు ప్రకటించారు.
దూరదర్శన్ చెన్నై కార్యక్రమంలో ‘ద్రవిడ’ ప్రస్తావన రానివ్వకపోవడంపై డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది వివాదాస్పదంగా మారింది. ఆ కార్యక్రమంలో గవర్నర్ రవి పాల్గొన్నారు. ఐక్యతకు భంగం కలిగించేలా ఆయన తీరు ఉందని డీఎంకే దుయ్యబట్టింది.