Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మద్య నిషేధం హుళక్కే !

మూడేళ్ల బార్ల పాలసీ విడుదల చేసిన ప్రభుత్వం
స్టార్‌ హోటల్స్‌లో అర్థరాత్రి వరకూ తాగే అవకాశం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:
దశలవారీ మద్యం విక్రయాలు తగ్గిస్తూ, 2024 నాటికి పూర్తిగా మద్యనిషేధం విధిస్తామని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆచరణలో దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరి స్తోంది. మద్యం ఆదాయమే కీలకంగా భావిస్తోంది. ఇప్పటికే మద్యంపై ఆదాయాన్ని చూపుతూ భారీ ఎత్తున అప్పులు తెస్తున్న ప్రభుత్వం, ఇక ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీని అటకెక్కించడం ఖాయమని తేలిపోయింది. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం గురువారం బార్ల పాలసీని విడుదల చేసింది. వచ్చే మూడేళ్ల కాలానికి ఈ విధానం అమల్లో ఉంటుంది. దీనిని బట్టి మద్యనిషేధం హుళక్కేనని తేలిపోయింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఈ కొత్త బార్ల విధానం అమల్లోకి రానుంది. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం అప్పటివరకూ కొనసాగే అవకాశం ఉంది. బార్‌ లైసెన్సుల జారీకి సంబంధించి ది ఆంధ్రప్రదేశ్‌ ఎక్సైజ్‌ రూల్స్‌ 2022 నోటిఫికేషన్‌ జీవో 527ను ఎక్సైజ్‌ శాఖ అధికారులు జారీ చేశారు. దేశీయంగా తయారైన, విదేశీ మద్యం రవాణాకు లైసెన్సుదారునికి అవకాశం ఇస్తూ నిబంధనలు ఖరారు చేశారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని మొత్తం మూడు కేటగిరీలుగా విభజించారు. 50 వేలు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.5 లక్షలు, ఏడాదికి నాన్‌ రిఫండబుల్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.15 లక్షలు, 50 వేలు నుంచి 5 లక్షల మధ్య ఉన్న జనాభా ప్రాంతానికి రూ.7.50 లక్షలు, ఏడాదికి నాన్‌ రిఫండబుల్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ. 35 లక్షలు, 5 లక్షలు పైబడి జనాభా ఉన్న ప్రాంతానికి రూ.10 లక్షలు, అప్లికేషన్‌ ఫీజు, ఏడాదికి నాన్‌ రిఫండబుల్‌ రిజిస్ట్రేషన్‌ ఫీ రూ.50 లక్షలుగా నిర్ణయించారు. బార్లలో దయం 11 గంటల నుంచి రాత్రి 11 వరకు మద్యం అమ్మకానికి అనుమతి ఉంటుందని, త్రీ స్టార్‌ హోటల్స్‌లో అయితే ఉదయం 11 గంటల నుంచి అర్దరాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకానికి అనుమతి ఇస్తున్నట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img