Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

స్టాక్‌ స్కామ్‌పైసెబీ దర్యాప్తు

. సీపీఐ జాతీయ కార్యదర్శివర్గం డిమాండ్‌
. ‘ఇండియా’తో కలిసి ముందుకెళతామని స్పష్టీకరణ

న్యూదిల్లీ: ఎగ్జిట్‌ పోల్స్‌ ఏకపక్షంగా వెలువడటంపైనా… స్టాక్‌మార్కెట్‌ ఒక్కసారిగా పెరగడంపైనా సెబీ దర్యాప్తు చేసి పార్లమెంటుకు నివేదిక సమర్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శివర్గం డిమాండ్‌ చేసింది. ఎన్నికల సంస్కరణలు అవసరమని స్పష్టం చేసింది. ఏడు దశల్లో ఎన్నికల నిర్వహణ కోసం రెండు నెలల సమయం ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని, భవిష్యత్‌లో దీనిని నివారించాలని సూచించింది. సీపీఐ సహా వామపక్షాలు సాధించిన ఫలితాలపై ఆత్మవిమర్శ అవసరమని, పూర్తిస్థాయిలో నివేదికలు వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాలను నిశితంగా సమీక్షిస్తామని తెలిపింది. సీట్ల సర్దుబాటు మరింత మెరుగ్గా జరిగి… ఐక్యంగా ప్రచారం నిర్వహించివుంటే బీజేపీని మరింత కట్టడి చేయడం సాధ్యమయ్యేదన్న అభిప్రాయాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గం వ్యక్తం చేసింది. పార్టీ కార్యదర్శి అజీజ్‌ పాషా అధ్యక్షతన గురు, శుక్రవారాల్లో జరిగిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఎన్నికల ఫలితాలపై ప్రధాన కార్యదర్శి డి.రాజా సమీక్ష నిర్వహించి చర్చ ప్రారంభించారు. సమావేశం అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శివర్గం ప్రకటన విడుదల చేసింది. రాజ్యాంగానికి, లౌకిక ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రజల తీర్పు వెలువడటంపై సీపీఐ హర్షం వ్యక్తం చేసింది. నిరుద్యోగం, సమాఖ్యవాదంపై, మైనారిటీలపై, ప్రజాస్వామ్యంపె,ౖ మానవహక్కులపై దాడులను తిప్పికొడుతూ విద్వేషాన్ని, వివక్షను తిరస్కరించిన దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపింది. మంచి ఫలితాలు రాబట్టగలిగినందుకు ఇండియా ఐక్య సంఘటనలోని పార్టీలను అభినందించింది. ఎన్నికల ప్రచారంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ విద్వేష ప్రసంగాలు చేసిన నరేంద్రమోదీపై చర్చలు తీసుకోవడంలో ఎన్నికల సంఘం విఫలమైందని విమర్శించింది. ఇండియా ఐక్య సంఘటనలో కీలకంగా వ్యవహరిస్తామని తెలిపింది. ఉజ్వల భవిష్యత్‌ కోసం ప్రాథమిక హక్కుల పరిరక్షణ దిశగా ప్రజలను మరింత చైతన్యపర్చడంలో క్రియాశీల పాత్ర పోషించగలమని సీపీఐ పేర్కొంది.
ఎన్నికల్లో ధనబలం పెరిగిపోయిందని, శక్తిమంతమైన ప్రజాస్వామ్యంలో ఇటువంటివి ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. రాజ్యాంగంలోని ‘భారత్‌ ఆలోచన’ను సమర్థిస్తూ ప్రజా తీర్పు వెలువడటంపై హర్షం వ్యక్తంచేసింది. అహంకార బీజేపీకి దేశ ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పారని తెలిపింది. 18వ లోక్‌సభ ఎన్నికలతో ఏకపార్టీ పాలన, కార్పొరేట్‌ మద్దతుగల బీజేపీ ఫాసిస్టు పాలన అంతమైందని సీపీఐ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img