. ఎయిరిండియా విమానానికి ‘ఎమర్జెన్సీ’
. గాల్లోనే రెండు గంటలకు పైగా చక్కర్లు
. ఉత్కంఠ నడుమ సురక్షిత ల్యాండిరగ్
. తమిళనాడులోని తిరుచ్చిలో ఘటన
తిరుచ్చి : తమిళనాడు నుంచి షార్జాకు బయలుదేరిన ఎయిరిండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా… పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించడం ఒక్కసారిగా కలవరానికి గురిచేసింది. హైడ్రాలిక్ వ్యవస్థ పనిచేయడం లేదని గుర్తించిన పైలట్లు… తిరుచ్చి విమానాశ్రయాన్ని అప్రమత్తం చేశారు. తమిళనాడులోని తిరుచ్చి నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో తిరుచ్చి విమానాశ్రయంలో ల్యాండిరగ్ కోసం ఏర్పాట్లు చేయడంతో రాత్రి 8 గంటల తర్వాత ఉత్కంఠ పరిస్థితుల మధ్య సురక్షితంగా ల్యాండిరగ్ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎయిరిండియా విమానం ఏఎక్స్బి 613 తిరుచ్చి నుంచి షార్జాకు శుక్రవారం సాయంత్రం 5.40 గంటలకు బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 141 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే హైడ్రాలిక్ వ్యవస్థ విఫలమైనట్లు పైలట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఏటీసీకి తెలియజేయడంతో అప్రమత్తమైన అధికారులు… అత్యవసర ల్యాండిరగ్కు అనుమతిచ్చారు. అయితే విమానం సురక్షిత ల్యాండిరగ్ కావాలంటే అందులో ఉన్న ఇంధనం నిర్దేశిత స్థాయి వరకు తగ్గాల్సి ఉంటుంది. దీంతో సురక్షిత ల్యాండిరగ్ కోసం ప్రయత్నించిన పైలట్లు… దాదాపు రెండు గంటల పాటు విమానాన్ని గాల్లోనే చక్కర్లు కొట్టించారు. దీంతో ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఇదే సమయంలో ఏదైనా ప్రతికూల పరిస్థితి ఏర్పడితే ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు ముందస్తు ఏర్పాట్లను సైతం చేశారు. 20 అంబులెన్సులు, 20 అగ్నిమాపక యంత్రాలతోపాటు పారామెడికల్ సిబ్బందిని విమానాశ్రయంలో సిద్ధంగా ఉంచారు. అయితే ఎట్టకేలకు హైడ్రాలిక్ గేర్ పనిచేయడంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ప్రయాణికులు, అధికారులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఈ సందర్భంగా పైలట్లకు ప్రయాణికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పైలట్లను తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ అభినందించారు.