London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ఉచిత ఇసుక విధానం ఇదే

. రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ
. 2019, 2021 విధానాలు రద్దు
. రాష్ట్ర ఖజానాకు ఆదాయం లేకుండా సరఫరా
. లోడిరగ్‌, రవాణా ఛార్జీలకు డిజిటల్‌ చెల్లింపులు
. భవన నిర్మాణాలకే వినియోగించాలని స్పష్టీకరణ
. అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఉచిత ఇసుక పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు 2019, 2021 ఇసుక విధానాలు రద్దు చేస్తూ జీవో 43 ద్వారా ఉత్తర్వులు ఇచ్చింది. ఉచిత ఇసుకను ఎలా పంపిణీ చేయాలనే దానిపై విధివిధానాలు ఖరారు చేస్తూ తొమ్మిది పేజీల జీవో విడుదల చేసింది. కొత్త ఇసుక విధానాన్ని రూపొందించే వరకు ఈ విధివిధానాలు వర్తిస్తాయని, రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వినియోగదారులకు ఇసుక అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడిరచింది. ఇసుక తవ్వకాల నిమిత్తం కలెక్టర్‌ ఛైర్మన్‌గా జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కమిటీల్లో జిల్లా ఎస్పీ, సంయుక్త కలెక్టర్‌ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు ఉండాలని పేర్కొంది. జిల్లాల్లోని స్టాక్‌ పాయింట్లను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆ కమిటీలకు సూచించింది. రాష్ట్రంలోని వివిధ స్టాక్‌ పాయింట్లలో 49 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ఇసుక అందుబాటులో ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో డి-సిల్టేషన్‌ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డి-సిల్టేషన్‌ ఎక్కడెక్కడ చేపట్టాలనేది జిల్లాస్థాయి కమిటీలు నిర్ణయిస్తాయని, ఇసుక లోడిరగ్‌, రవాణా ఛార్జీలను నిర్థారించే బాధ్యత జిల్లా కమిటీలకే ఉంటుందని తెలిపింది. స్టాక్‌ పాయింట్ల వద్ద లోడిరగ్‌, రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్‌ విధానం ద్వారానే జరపాలని స్పష్టం చేసింది. ఇసుకను తిరిగి విక్రయించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అలాగే భవన నిర్మాణాలకు మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించవద్దని తెలిపింది. ఇసుక అక్రమ రవాణా చేసినా, ఫిల్లింగ్‌ చేసినా జరినామాలు ఏ విధంగా వేయాలో నిర్ధారిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. వినియోగదారుడు ఎత్తుడు, దించుడు కూలీతో ఇతర చట్టబద్ధమైన పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక పాలసీ అమలులోకి వస్తుందని ముందే ప్రచారం జరగడంతో ఉదయం నుంచే స్టాక్‌ పాయింట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. అయితే మధ్యాహ్నం వరకు ఇసుక పాలసీపై ప్రభుత్వం నుంచి జీవో విడుదల కాకపోవడంతో అధికారులు ఎదురు చూపులు చూశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే జీవో విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఆఘమేఘాలపై జీవో విడుదలకు చర్యలు తీసుకున్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపమే జీవో విడుదలకు ఆలస్యమని తెలిసింది. ముఖ్యమంత్రి ముందుగా చెప్పిన ప్రకారం ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తూ చర్యలు తీసుకోవడం నిర్మాణరంగదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img