. ధరల నియంత్రణకు మంత్రివర్గ ఉపసంఘం
. అమరావతిలో నార్కోటిక్స్ ప్రధాన కార్యాలయం
. కీలక అంశాలపై మంత్రిమండలి ఆమోద ముద్ర
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్రంలో భారీగా ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం ప్రతిపాదించింది. రాబోయే ఐదేళ్లల్లో 20లక్షల ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్లో అనేక కీలక అంశాలకు ఆమోదముద్ర వేశారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడంలో భాగంగా మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మొత్తంగా 19 అంశాలకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. అందులో ఆరు కొత్త పాలసీలు
‘‘ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 4.0, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ4.0 (2024
2029), ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ4.0 (2024
2029), ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎంట్రప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ4.0 (2024
2029), ‘ప్లగ్ అండ్ ప్లే’ ఇండస్ట్రియల్ఇన్ఫ్రాస్ట్రక్చర్
4.0 (2024-29), ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0 (20242029)’’ లకు ఆమోదముద్ర వేసింది. ఆయా పాలసీల ద్వారా యువతకు 20లక్షల ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రతిపాదించారు. దీంతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన అభివృద్ధి పనులను నిర్ణయించారు. మంత్రి మండలిలో ఆమోదించిన మరికొన్ని అంశాల వివరాలిలా ఉన్నాయి: అ కృష్ణాజిల్లా మల్లవల్లిలోని ఇండస్ట్రియల్ పార్కుకు సంబంధించిన కొన్ని సమస్యలపై ఏపీఐఐసీ ప్రతిపాదనలకు ఆమోదం. అ దాదాపు 150 ఎకరాల్లో అందుబాటులో ఉన్న ప్లాట్లను 349 మంది కేటాయింపుదారులకు తిరిగి కేటాయించడంతో పాటు లేఅవుట్ క్రమబద్ధీకరణ. అ ఇండస్ట్రియల్ పార్కులో ప్లాట్ల ధరల కేటాయింపుదారుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వం గతంలో జారీచేసిన జీవో నంబరు
78 ప్రకారం…19.05.2017లో నిర్ణయించిన ధర ప్రకారం ఎకరం రూ.16.50 లక్షలకు కేటాయింపు.
. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ పథకం కింద మల్లవల్లిలో మౌలిక సదుపాయాల కల్పన పనులకుగాను రూ.1,000 కోట్ల రుణానికి ప్రభుత్వ హ్యండ్ హోల్డింగ్కు ఏపీఐఐసీ చేసిన ప్రతిపాదనకు ఆమోదం.
. ధరల పర్యవేక్షణ, నియంత్రణకు మంత్రుల బృందం ఏర్పాటు.
. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, అక్రమ మద్యం, బాధితుల పునరావాసం తదితర అంశాలపై అధ్యయనం తో పాటు సిఫార్సులు చేసేందుకు మంత్రుల బృందం ఏర్పాటు.
. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లోగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై దృష్టి.
. రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మాదకద్రవ్యాల వాడకం కేసులు పెరగడంతో…ఆంధ్రప్రదేశ్ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ఏపీ ఏఎన్టీఎఫ్) ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడంతో పాటు 26 జిల్లాల్లో నార్కోటిక్స్ పోలీసు బృందాల ఏర్పాటు.
. ఏపీ హైకోర్టు ఆధ్వర్యంలో జిల్లాల్లో 5 ప్రత్యేక కోర్టులు లేదా 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు.
. చెత్త పన్ను రదు.
. గ్రామీణ, పంచాయతీ, పట్టణ రహదారుల మరమ్మతులకు చేపట్టిన పనుల ప్రగతిని తెలిపే స్టేటస్ నోట్కు ఆమోదం.