చెన్నై : తమిళనాడు చెన్నై శివారులో శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగింది. తిరువళ్లూరు సమీపంలోని కావరిపెట్టై వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును మైసూర్ – దర్భంగా మధ్య నడిచే భాగమతి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు భోగీలు దగ్ధమయ్యాయి. నాలుగు ఏసీ భోగీలు పట్టాలు తప్పాయి. దాదాపు 20 మందికి గాయాలైనట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పట్టాలపై ఆగి ఉన్న గూడ్స్ రైలును భాగమతి ఎక్ర్ప్రెస్ అతివేగంతో వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు సాగుతున్నాయి. సిగ్నలింగ్ సమస్యే ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదంతో చెన్నై సెంట్రల్ నుంచి ఢల్లీికి వెళ్లే తమిళనాడు ఎక్స్ప్రెస్తో సహా కొన్ని రైళ్లు రద్దు చేశారు. నెల్లూరు – చెన్నై మధ్య రైళ్ల రాకపోకలు సైతం నిలిచిపోయాయి.