జమ్మూకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.పహల్గామ్లో భద్రతా బలగాల వాహనం నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు చనిపోయారు. ఆ బస్సులో ఇండో టిబెటన్ బోర్డర్ జవాన్లు ప్రయాణిస్తున్నారు. ప్రయాణించే సమయంలో బస్సులో మొత్తం 39 మంది ఉన్నారు. బస్సు ఫ్రిస్లాన్ దగ్గర రోడ్డుపై నుంచి నదిలో పడిపోయింది.ఈ ప్రమాద ఘటనలో 30మంది ఐటీబీపీ జవాన్లు గాయపడ్డారు. నదిలో పడిన బస్సు…ఆరుగురు ఐటీబీపీ జవాన్ల మృతి క్షతగాత్రులకు ప్రథమచికిత్స చేసి వారిని చికిత్స కోసం అనంత్ నాగ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన మరో ముగ్గురిని పహల్ గాంలోని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు.