పిన్నెల్లికి హైకోర్టు ఆదేశం
విశాలాంధ్ర – అమరావతి : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్కు సంబంధించిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం శుక్రవారం జారీ చేసింది. జూన్ 6 వరకు మాచర్ల వెళ్లవద్దని ఆదేశించింది. లోక్సభ నియోజకవర్గ కేంద్రంలోనే ఉండాలని సూచించింది. ఓట్ల లెక్కింపు రోజు మాచర్లకు వెళ్లొద్దని,. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొచ్చని చెప్పింది. కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని సూచించింది. సాక్షులతో మాట్లాడే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించింది. పిన్నెల్లి కదలికలపై పూర్తిస్థాయి నిఘా ఉంచాలన్న న్యాయస్థానం ఈమేరకు సీఈవో.. పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లిపై జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.