2530 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు బ 26
31 ధ్రువీకరణ పత్రాల పరిశీలన
నవంబరు 1`5 నుంచి వెబ్ ఆప్షన్లు
10న ఇంజినీరింగ్, ఫార్మసీ సీట్ల కేటాయింపు
ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో 81,597 కన్వీనర్ సీట్లు: మంత్రి ఆదిమూలపు
4 ప్రైవేట్ యూనివర్సిటీల్లో 35శాతం సీట్లు కేటాయింపు
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఏపీ ఈఏపీసెట్
2021 కౌన్సెలింగ్లో భాగంగా ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం విజయవాడలోని ఓ హోటల్లో సాంకేతిక విద్యాశాఖ మంత్రి పోలా భాస్కర్తో కలిసి ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ ఈఏపీసెట్`2021 కౌన్సెలింగ్ షెడ్యూలు ప్రక్రియను వెల్లడిరచారు. ఈఏపీసెట్2021లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ఈనెల 25 నుంచి 30 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు నమోదు, ఫీజుల చెల్లింపునకు అవకాశమిచ్చారు. 26 నుంచి 31 వరకు అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాల్ని పరిశీలిస్తారు. నవంబర్ 1నుంచి 5 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. వెబ్ ఆప్షన్ల మార్పులకు నవంబర్ 6 వరకు అవకాశముంది. 10న ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్ల కేటాయిస్తారు. 10 నుంచి 15 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. నవంబర్ 15 నుంచి ఇంజనీరింగ్, ఫార్మసీ తరగతుల్ని ప్రారంభిస్తారు. కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే కొనసాగుతుంది. ప్రైవేట్ యూనివర్సిటీల్లోనూ 35శాతం కన్వీనర్ కోటా రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్సిటీలలోనూ 35శాతం ఇంజినీరింగ్, ఫార్మశీ సీట్లను కన్వీనర్ కోటా కింద కేటాయించనున్నారు. ఏపీఈఏపీసెట్
2021కు మొత్తం లక్షా 66వేల 460 మంది పరీక్షకు హాజరుకాగా, వారిలో లక్షా 34వేల 205 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజినీరింగ్, ఫార్మసీలో రాష్ట్ర వ్యాప్తంగా కన్వీనర్ కోట కింద 81,597 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈఏపీసెట్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా రాష్ట్రంలోని 25 ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు, 9 ఫార్మసీ, 2 ఫార్మాడి కళాశాలలున్నాయి. వీటిలో మొత్తం 6747 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 4 ప్రైవేట్ యూనివర్సిటీలలో 2330 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. 297 ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఫార్మా
డీ కళాశాలల్లో 72,520 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వెబ్ కౌన్సెలింగ్కు సంబంధించి 8106876345, 8106575223, 7995865456కు ఫోన్చేసి విద్యార్థులు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. విజయవాడ ప్రసాదంపాడులోని ఏపీఈఏపీసెట్`2021 కన్వీనర్ కార్యాలయం నుంచి కూడా పూర్తి వివరాలు పొందవచ్చు. ఈ కార్యక్రమానికి సాంకేతిక విద్యాశాఖ జాయింట్ డైరెక్టరు ఎ.నిర్మల్కుమార్, స్పెషల్ ఆఫీసర్ సుధీర్రెడ్డి, చీఫ్ క్యాంప్ ఆఫీసర్ బి.కల్యాణ్ పాల్గొన్నారు.