. విదర్భలో అల్పపీడనం కేంద్రీకృతం
. 21 వరకు అప్రమత్తం: ఐఎండీ హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈనెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభా వంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈనెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే మూడు రోజులుగా వివిధ ప్రాంతాలలో వర్షాలు కురుస్తుండగా, రాబోయే నాలుగు రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏపీలోని ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాలతోపాటు, యానాంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని దక్షిణ ఒడిశా తీరం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిరదని, దీని ప్రభావంతో గురువారం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణా సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్్ పేర్కొన్నారు. దక్షిణ చత్తీస్గఢ్ మీదుగా సాగుతున్న అల్పపీడనం వల్ల ఈ జిల్లాలకు వాన గండంతోపాటు, విజయనగరం, అనకాపల్లి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఐఎండీ సూచనల ప్రకారం విదర్భకు ఆనుకొని ఉన్న దక్షిణ చత్తీస్గఢ్ మీదుగా అల్పపీడనం కొనసాగుతుందని కూర్మనాథ్ తెలిపారు. గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు… శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, గుంటూరు, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, విశాఖ పట్నం, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, అనంత పురం, నంద్యాల, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు.
తెలంగాణలోనూ అదే పరిస్థితి
తెలంగాణ రాష్ట్రంలో కూడా అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ గంటలకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడిరచింది. దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం బుధవారం బలహీనపడినట్లు తెలిపింది. రుతుపవన ద్రోణి జైసాల్మయిర్, కోట, గుణ, కళింగపట్నం తూర్పు ప్రాంతం గుండా మధ్య బంగాళాఖాతం వరకు పయనిస్తూ సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మరో అల్పపీడనం ఈ నెల 19న పశ్చిమ మధ్య దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.