సుప్రీంకోర్టు ఆదేశం
న్యూదిల్లీ: దేశ రాజధాని దిల్లీని తీవ్రమైన నీటి సంక్షోభం వెంటాడుతోంది. అక్కడి ప్రజలు నీటి చుక్క కోసం అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ నీటి సంక్షోభాన్ని తీర్చడానికి యమునా మిగులు నీటిని విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వాన్ని గురువారం ఆదేశించింది. జూన్ 7వ తేదీన 137 క్యూసెక్కుల యమునా మిగులు నీటిని హర్యానాలోని హథినీకుండ్ బ్యారేజికి విడుదల చేయాలని సుప్రీం ఆదేశించింది. హథినీకుండ్ బ్యారేజికి విడుదలైన నీటిని నేరుగా దిల్లీలోని వజీరాబాద్కు విడుదల చేయాలని జస్టిస్ పీకే మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో దిల్లీ, హర్యానా, హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వాలు సోమవారంలోగా సమ్మతి అఫడవిట్లు దాఖలు చేయాలని సుప్రీం కోరింది. కాగా, నీటి కొరతను తీర్చేందుకుగాను యమునా నది మిగులు జలాలను విడుదల చేసే విధంగా హర్యానా, హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వాలను ఆదేశించాలని ఇటీవల దిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను జిస్టిస్ పీకే మిశ్రా ధర్మాసనం విచారించింది. ఈ మేరకు హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలను ఆదేశించింది.