Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

భర్తను కొట్టి.. భార్యను పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం

గుంటూరు జిల్లాలో దారుణం
అర్ధరాత్రి దంపతుల ఆర్తనాదం
పోలీసుల ఉదాసీనతపై విమర్శలు

మేడికొండూరు : రాష్ట్రంలో మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా సినీ ఫక్కీలో నలుగురు వ్యక్తులు పక్కాగా ప్లాన్‌ చేసి ఓ మహిళపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో చోటు చేసుకుంది. మహిళ భర్తతో కలిసి బైక్‌ పై వెళుతున్న సమయంలో దారికాచి అడ్డగించి భర్తను అతిదారుణంగా కొట్టి, కాళ్లూ చేతులను కట్టేసి.. భార్యను పొలాల్లోకి లాక్కెళ్లి కొడవళ్లు చూపించి బెదిరించి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సత్తెనపల్లి వడ్డెర కాలనీకి చెందిన భార్య భర్తలు బుధవారం మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలోని తమ సమీప బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు. రాత్రి 9గంటల సమయంలో ద్విచక్రవాహనంపై సత్తెనపల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. పాలడుగు అడ్డరోడ్డులో వెళ్తుండగా రోడ్డుపై చెట్టు పడి ఉంది. చెట్టు పక్కగా వెళ్తుండగా బైక్‌కి కట్టె అడ్డుపెట్టడంతో దంపతులిద్దరూ కింద పడ్డారు. గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు వారి వద్దకు వచ్చి కొడవళ్లు చూపించి బెదిరించారు. చేతులతో చితకబాదారు. బట్టలు విప్పి భర్త చేతులు కాళ్లు కట్టేశారు. మహిళను పక్కకు తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ మెడలో ఉన్న మంగళ సూత్రం, బంగారు ఉంగరం, కాళ్ల పట్టీలను లాక్కున్నారు. కొడవళ్లు చూపిస్తూ జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు. సుమారు అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ దారుణం చోటు చేసుకుంది. 12 గంటల తర్వాత దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో భార్య భర్తలు తన ద్విచక్ర వాహనంపై సత్తెనపల్లి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. ఫిర్యాదు తీసుకునేందుకు అక్కడి పోలీసులు నిరాకరించారు. తమ పరిధిలోకి రాదని అన్నారు. దీంతో గురువారం ఉదయం మేడికొండూరు పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చి వారు జరిగిన దారుణంపై ఫిర్యాదు చేయగా పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 376డి, 394, 342 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని గుంటూరు జీజీహెచ్‌ కు తరలించారు. అక్కడ ఆమెకు వైద్య పరిక్షలు నిర్వహించి అనంతరం చికిత్స అందిస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే ఘటనా స్థలాన్ని గుంటూరు డీఎస్పీ ప్రశాంతి పరిశీలించారు. పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సత్తెనపల్లి పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ కేసు నమోదు చేయకపోవటాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ఫిర్యాదు తీసుకుని జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా తమ పరిధి కాదని తప్పించుకున్నారని ఆరోపిస్తున్నారు.
డీఎస్పీ వివరణ..
సామూహిక అత్యాచారానికి సంబంధించి పోలీసులు సకాలంలోనే స్పందించారని సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి చెబుతున్నారు. బాధితులు సత్తెనపల్లి స్టేషన్‌ కు రాగానే వారి నుంచి వివరాలు తీసుకుని మేడికొండూరు పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. అలాగే రెండు స్టేషన్లకు సంబంధించిన పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లటంతో పాటు నిందితుల కోసం గాలించినట్లు వివరించారు. అత్యాచార ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పాలడుగు సమీపంలో శీతల గోదాము నిర్మాణ పనుల కోసం వచ్చిన కూలీలను విచారించారు. వారంతా ఒడిశా, విజయనగరం ప్రాంతాల నుంచి వచ్చినవారు. వారికి ఈ ఘటనతో ఏమైనా సంబంధం ఉందా లేక ఘటన జరిగిన తర్వాత నిందితులు అటుగా వచ్చారా అనే కోణంలో విచారించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img