కలెక్టరేట్లో సీఎం చంద్రబాబుతో రామకృష్ణ, సంతోశ్కుమార్ భేటీ అయ్యారు. ముంపు ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ కార్యక్రమాలు, యుద్ధప్రాతిపదికన జరుగుతున్న బుడమేరు గండ్లు పూడ్చివేత పనుల పట్ల అభినందనలు తెలిపారు. సహాయ కార్యక్రమాల అమల్లో జరుగుతున్న లోటుపాట్లను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలపై తక్షణమే దృష్టి పెట్టాలని కోరారు.
ఈ పర్యటనలో సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జి.ఓబులేసు, జి.ఈశ్వరయ్య, కేవీవీ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, సీపీఐ ఎన్టీఆర్, కృష్ణా జిల్లా, విజయవాడ, గుంటూరు నగర కార్యదర్శులు దోనేపూడి శంకర్, మాల్యాద్రి, టి.తాతయ్య, జి.కోటేశ్వరరావు, విశాలాంధ్ర డీజీఎం టి.మనోహర్ నాయుడు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య, ఇస్కఫ్ రాష్ట్ర నాయకులు సుబ్బారావు, డీహెచ్పీఎస్ నాయకులు బుట్టి రాయప్ప, విద్యార్థి, యువజన సమాఖ్య రాష్ట్ర నేతలు జాన్సన్ బాబు, పరుచూరి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.